గొప్ప‌మ‌న‌సు చాటుకున్న సైబ‌రాబాద్ పోలీసులు.. విష‌యం తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే!

-

సైబ‌రాబాద్ పోలీసులు మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటామ‌ని సీపీ స‌జ్జ‌నార్ ఉతార‌త తెలిపారు. ఎవ‌రికి ఎలాంటి ఆప‌ద వ‌చ్చినా వెంట‌నే స్పందించే ఆయ‌న.. ఈ ఆప‌త్కాలంలో మ‌రో గొప్ప నిర్ణ‌యం తీసుకుని అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న కొన్ని వివ‌రాలు చెప్పారు.

హైద‌రాబాద్‌న‌గ‌రంలో ఎవ‌రికైనా క‌రోనా వ‌స్తే.. వారి పిల్ల‌ల‌ను త‌మ సంర‌క్ష‌ణ‌లో ఉంచుకుంటామ‌ని చెప్పారు. ఇప్పుడున్న డేకేర్ సెంట‌ర్ల‌ను చైల్డ్‌కేర్ సెంట‌ర్లుగా మారుస్తున్నామ‌ని వివ‌రించారు. త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా వ‌చ్చి పిల్ల‌ల‌కు రాకుంటే.. ఆ పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రుల‌కు నెగెటివ్ వ‌చ్చేంత వ‌ర‌కు చాలా జాగ్ర‌త్త‌గా చూసుకుంటామ‌న్నారు.

పిల్ల‌ల పూర్తి బాధ్య‌త‌ను తామే చూసుకుంటామ‌ని, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా తామే చైల్డ్ కేర్ సెంట‌ర్‌లో అన్నీ అందిస్తామ‌న్నారు. ఎవ‌రికైనా సాయం కావాల్సి వ‌స్తే సైబ‌రాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబ‌ర్ 080-45811215కి కాల్ చేయాల‌ని కోరారు. ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు వ‌ద్ద‌ని, తాము అన్ని ర‌కాలుగా పిల్ల‌ల‌కు, త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. ఎంతైనా సైబ‌రాబాద్ పోలీసులు గ్రేట్ క‌దా.

Read more RELATED
Recommended to you

Latest news