రత్నదీప్ సూపర్ మార్కెట్ లో పాడైన ఐటమ్స్‌..పోలీసులకు ఫిర్యాదు

-

హైదరాబాద్‌ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో పాడైన ఐటమ్స్‌ వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌ సుచిత్రలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ముందు కస్టమర్స్ గొడవ దిగారు. పాడైన ఫుడ్ ఐటమ్స్ అముతున్నారంటూ ఆరోపణలు చేశారు. చికెన్ నగ్గెట్స్ కొన్న ఓ వ్యక్తి.. ఇంటికెళ్లి ఓపెన్ చేసి చూడగా పాడైన వాసన వచ్చింది.

పాడైన ప్యాకెట్ తో స్టోర్ కి వెళ్లి మిగతావి ఓపెన్ చేయగా స్టాక్ మొత్తం అలాగే ఉంది. అదే సమయంలో పాడైన నగ్గెట్ ప్యాకెట్స్ తో మరో ఇద్దరు కస్టమర్స్ వచ్చారు. అయితే.. దీనిపై సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు సుచిత్ర రత్నదీప్ స్టోర్ మేనేజర్. కస్టమర్స్ గొడవ చేయడంతో స్టోర్ కి వచ్చారు మరో ఏరియా స్టోర్ మేనేజర్. రేపు మాట్లాడుదాం అంటూ స్టోర్ క్లోజ్ చేసింది సిబ్బంది. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కస్టమర్స్. ఇక ఈ కేసు గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news