ఇదే నా చివరి ఎన్నిక.. అందుకే నన్ను గెలిపించండి : దానం నాగేందర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఓవైపు కీలక నేతలైన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ప్రచారంలో జోష్ చూపిస్తుండగా.. మరోవైపు అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెడుతుండగా.. అభ్యర్థులు కేసీఆర్ భరోసాను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.

ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలని దానం అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానాన్ని పార్టీ కార్యకర్తకు ఇస్తానని హామీ ఇచ్చారు. తానూ ఓ కార్యకర్తే అని.. ఆ స్థాయి నుంచే ఎమ్మెల్యే స్థానానికి ఎదిగానని తెలిపారు. కార్యకర్తల త్యాగాల వల్లే తమలాంటి వాళ్లు పదవులు అధిరోహిస్తారని.. అందుకే తానెప్పుడూ కార్యకర్తల వెంటనే ఉంటానని చెప్పారు. కానీ కొంత మంది కార్యకర్తలను వాడుకొని వదిలేస్తున్నారని మండిపడ్డారు. తనకు కార్యకర్తలే బలమని… వచ్చే ఎన్నికల్లో వారే గెలిపిస్తారని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news