ఢిల్లీ BRS కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్

-

ఢిల్లీలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 4న వసంత్ విహార్ లో నిర్మించిన ఆఫీసును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న జరగనున్న పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మినీ ప్లీనరీలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, మేయర్లు, ఛైర్మన్లు తదితర ముఖ్య నేతలు సహా దాదాపు మూడువేలకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news