యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడికి గుడిలోకి నో ఎంట్రీ !

-

DCC president Andem Sanjiva Reddy: యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడికి గుడిలోకి ఎంట్రీ లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల యాదాద్రి పర్యటన సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డిని పోలీసులు గుడిలోకి రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఇప్పుడు వివాదంగా మారింది.

DCC president Andem Sanjiva Reddy was prevented from entering the temple by the police

కాగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఇవాళ్టి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 18న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజైన నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన రేవంత్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news