వామన్ రావు న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడికి బెయిల్..

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్ద పెల్లి లోని న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో నిందితుడికి బెయిల్ మంజూరు అయింది. జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల శివారులో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి హత్య కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న పెద్దపెల్లి పట్టణానికి చెందిన అనిల్ కు బెయిల్ లభించింది.

2022 ఫిబ్రవరి 17న జరిగిన ఈ హత్య కేసులో కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శ్రీనివాస్, కాపు అనిల్, ఉదరి లచ్చయ్య, వెల్ది వసంతరావు లు నిందితులుగా ఉన్నారు, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారిస్తుండగా గత నెలలో ఆరో నిందితుడిగా ఉన్న వసంతరావు కు బెయిల్ లభించింది. తాజాగా గురువారం 5వ నిందితుడిగా ఉన్న కాపు అనిల్ కు బెయిల్ మంజూరు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news