ప్రజాస్వామ్యాన్ని లూటీ స్వామ్యంగా మార్చేశారు : మోడీ 

-

నిజామాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సశాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇందూరు ప్రజాగర్జన సభలో మాట్లాడారు ప్రధాని మోడీ.  సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను నిజాం నుంచి విముక్తి కలిగించారు. మరో గుజరాతీ తెలంగాణ సంమృద్దికి కృషి చేస్తున్నారు. తెలంగాణ కోసం కేంద్రం భారీగా నిధులు బీఆర్ఎస్ వాటిని లూటి చేసిందన్నారు.  తెలంగాణ లో ఒక కుటుంబం ప్రజల ఆంక్షలను కబ్జా చేశారు. కుటుంబ పాలనలో అంతా తమ వారికే లబ్దిపొందేలా చూసుకుంటారు.

కాంగ్రెస్ మహిళా బిల్లు బయట మద్దతు తెలుపుతూ.. లోపల కుట్రలు చేసిందన్నారు.  దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లనే మహిళా బిల్లును పాస్ చేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం అన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని మోడీ పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news