ధరణి వచ్చి దరిద్రం వచ్చినట్లయింది – కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు

-

ధరణి వచ్చి దరిద్రం వచ్చినట్లయింది అని మండిపడ్డారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి. ధరణి రచ్చబండకు హాజరయ్యారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే సంపత్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ విజయ రెడ్డి. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోయాయి అన్నారు.

భూ సమస్యలను సి ఎస్ సోమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ను కలుద్దాం అంటే అయన టైం ఇవ్వడంలేదన్నారు. సీఎంకు ఎన్ని లేఖలు రాసినా స్పందన కరువైందని అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ లో ఎమ్మార్వో చనిపోవడానికి భూ సమస్యలే కారణమని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి భూసమస్యలు రాలేదన్నారు కోదండ రెడ్డి. అసైన్డ్ ల్యాండ్స్ వెంచర్లు గా వేసుకుని అధికార పార్టీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news