కాంట్రాక్టర్ల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా..? – కోమటిరెడ్డి

-

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంట్రాక్టర్ల కోసం సాధించుకున్నామా..? అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే, బిజెపి జాతీయ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 26 రోజులుగా తమ న్యాయపరమైన సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు సంఘీభావం పలికిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణ ఎవరికోసం సాధించుకున్నాం.. కేవలం కాంట్రాక్టర్ల కోసమా..? నీటిలో మునిగిపోయే ప్రాజెక్టుల కోసం వచ్చిందా..? కెసిఆర్ కుటుంబం కోసం వచ్చిందా..? అని నిలదీశారు. తెలంగాణ సాధించుకుంది పేదల కోసం అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నానని.. కచ్చితంగా వారి న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రాజగోపాల్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news