దిల్​సుఖ్​నగర్​ బాంబ్​ బ్లాస్ట్​ మాస్టర్​ మైండ్​ సయ్యద్​ మఖ్బూల్​ మృతి

-

ఇండియన్​ ముజాహిదీన్​ తీవ్రవాది, హైదరాబాద్​తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో వరుస బాంబు పేలుళ్ల వెనక ఉన్న మాస్టర్ మైండ్ సయ్యద్​ మఖ్బూల్​(52) అనారోగ్యంతో మృతి చెందాడు. చర్లపల్లి జైల్లో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న సయ్యద్​ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. నెల రోజుల క్రితం గుండె ఆపరేషన్​ జరిగింది. ఆ తర్వాత మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించడం, రెండు రోజుల క్రితం పల్స్​ పడిపోవడంతో జైలు అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్న టెర్రరిస్ట్​ సయ్యద్​ గురువారం మరణించాడు.

ఈ టెర్రరిస్ట్ స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్​. ఉగ్రసంస్థ ఇండియన్​ ముజాహిదీన్​ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి అత్యంత సన్నిహితుడిగా సయ్యద్​ మఖ్బూల్​కు పేరుంది. యాసిన్​ భత్కల్​ సహా మరికొందరితో కలిసి హైదరాబాద్​ సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పేలుళ్ల వెనుక సూత్రధారి అని ఇతడిపై అభియోగాలు ఉన్నాయి. 2006లో వారణాసి, 2007లో ముంబయి వరుస పేలుళ్లు, 2008లో జైపుర, 2008లో దిల్లీ, అహ్మదాబాద్​, బెంగళూరుతో పాటు హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు ఎన్​ఐఏ ప్రస్తావించింది.

Read more RELATED
Recommended to you

Latest news