నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

-

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో కవితను హాజరు పర్చనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు కవిత…మార్చి 15న హైదరాబాదులో లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది ఈడి. ఈడి కస్టడీలో లిక్కర్ స్కాంలో కవిత పాత్ర పై ఇంటరాగేషన్ చేశారు అధికారులు.

ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టై వాంగ్మూలం ఇచ్చారు పలువురు నిందితులు. నిందితుల వాంగ్మూలాలపై కవిత నుంచి క్లారిటీ తీసుకున్న ఈడి…ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తో కలిపి విచారించేందుకు మరో రెండు రోజుల కస్టడీ పొడగించాలని కోర్టును ఈడి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news