బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు.. 3 కోట్ల కారులో ఏకంగా !

-

 

 

 

పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికు ఊహించని షాక్‌ తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్ళల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం నుంచే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్ళల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

ED searches the houses of Patancheru MLA Mahipal Reddy and his brother Madhusudan Reddy

ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాలలో భారీగా డబ్బు దొరికిందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పటాన్చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది ఈడీ బృందం. నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలో కూడా కొనసాగుతున్నాయి సోదాలు. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో పటాన్చెరువు పోలీస్ స్టేషన్ లో పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కేసు నమోదు అయింది.

ఆ కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నారు. సంతోష్ మైన్స్ పేరిట మహిపాల్ రెడ్డి కూడా తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మూడు కోట్ల రూపాయల ల్యాండ్ క్రూజర్ కారును నిన్ననే కొనుగోలు చేశాడు. ఇక ఈ సమాచారం అందిన నేపథ్యంలో ఈడీ రంగం ప్రవేశం చేసినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news