జనార్దన్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డిలపై చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశం !

-

ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి, మంత్రి జగదీశ్‌ రెడ్డిలపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. ‘బిఆర్ఎస్ జోలికొస్తే కాల్చిపడేస్తా’ అంటూ గతవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి చేసిన వాక్యాలపై సీఈవో వికాస్ రాజ్ స్పందించారు.

కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆయన వాక్యాలపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేశారు. అలానే మంత్రి జగదీశ్ రెడ్డి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ సూర్యాపేట కౌన్సిలర్ రేణుక చేసిన ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా… ‘బిఆర్ఎస్ జోలికొస్తే కాల్చిపడేస్తా’ అంటూ గతవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా… రౌడీలను అణిచివేస్తానని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news