తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది అసెంబ్లీ కార్యాలయం. రెండు ఎమ్మెల్సీ లకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు.

ఇక నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ ల గడువు కొనసాగనుంది. 29న రెండు ఎమ్మెల్సీ లకు ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఫలితాలు కూడా విడుదల అవుతాయి.