తీన్మార్‌ మల్లన్నను ఓడిస్తా – ఏనుగుల రాకేష్‌ రెడ్డి

-

తీన్మార్‌ మల్లన్నను ఓడిస్తానని ప్రకటించారు ఏనుగుల రాకేష్‌ రెడ్డి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు టిఆర్ఎస్ అధినేత గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చేతుల మీదుగా పార్టీ బీఫామ్ అందుకోవటం ఒక గొప్ప అవకాశంగా, అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాల ద్వారా సమాజానికి విస్తృతంగా సేవ చేయాలని తపిస్తున్న నాకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన కెసిఆర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు చెప్పారు రాకేష్‌ రెడ్డి.

enugula rakesh reddy receved brs b form

నాపై ఎంతో నమ్మకంతో పార్టీ ఇచ్చిన అవకాశానికి వందశాతం న్యాయం చేస్తాననని… కచ్చితంగా గెలిచి శాసనమండలిలో పట్టభద్రుల గలమవుతూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, పట్టభద్రులు నాపై పెట్టుకున్న నమ్మకానికి వందశాతం న్యాయం చేస్తానని వివరించారు. బీ-ఫామ్ అందుకుంటున్న సందర్భంగా రాజ్యసభ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, రాజారాం యాదవ్ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news