కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రమాదం..ఎక్కువ అబద్దాలు ఆడుతున్నాడు – ఈటల

-

కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రమాదం..ఎక్కువ అబద్దాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. రామయంపేటలో బీజేపీ విజయ సంకల్పయాత్ర సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుచేయడంలో విఫలం అయ్యారు….కేసీఆర్ కంటే ఎక్కువ అబద్దాలు చెప్పే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు.

Etala Challenge To Revanth Reddy

రేవంత్ ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ఇస్తే తప్ప ఇళ్లు కట్టలేడు, పెన్షన్ ఇవ్వలేడు, జీతాలు ఇవ్వలేడంటూ ఫైర్‌ అయ్యారు ఈటల. వాళ్లకు ఓట్లు వేసి మనం అడుక్కోవడం ఎందుకు మనకే ఓట్లు వేసుకుందాం అన్నీ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు ఈటల.

నేను నంబర్ వన్ అన్న సీఎం కేసీఆర్ లక్ష రుణమాఫీ చేయకుండా బోల్తా పడ్డారు…34 వేల కోట్ల రుణమాఫీని రేవంత్ రెడ్డి ఎలా చేస్తాడని నిలదీశారు. రుణమాఫీ పై బహిరంగచర్చకు మేము సిద్ధం…రేవంత్ నువ్వు సిద్ధమా అంటూ సవాల్‌ చేశారు. ప్రజలు గోల్ మాల్ కారు …కాంగ్రెస్ ను గోల్ మాల్ చేస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news