కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు – ఈటల రాజేందర్

-

కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఫైర్‌ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఆర్ధిక మంత్రి హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని పేర్కొన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే తెచ్చిన అప్పు, ఖర్చు, కేటాయింపులు, జీఓలను వెబ్ సైట్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఆర్థిక పరిస్థితి పై హరీష్ రావు తో బహిరంగ చర్చకు సిద్దం… ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తానని సవాల్‌ చేశారు.

ప్రజా స్వామ్యం లో నిరసనలు అన్ని పార్టీ లు చేస్తాయి…ప్రభుత్వం అధ్వాన్నం గా దుర్మార్గం గా వ్యవహరిస్తుందని ఫైర్‌ అయ్యారు. ఇది ఎవరు చేసిన ఖండించల్సిందేనని.. ప్రభుత్వం పోలీస్ లను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పోలీస్ లను నమ్ముకున్న ఎవరు ముందు పడరని.. షర్మిల బిజెపి వదిలిన బాణమా కాదా అనేది పక్కన పెడితే ఆమెది ఒక పార్టీ అన్నారు. CPI, CPM లు కెసిఆర్ వదిలిన బాణాలా ? అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Latest news