పొంగులేటి కాంగ్రెస్ లో చేరినా.. ఖమ్మంలో మెజారిటీ స్థానాలు మేమే గెలుస్తాం – ఎంపీ అరవింద్

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఖమ్మంలో మెజారిటీ స్థానాలు తామే గెలుస్తామని అన్నారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. మంగళవారం ఆర్మూర్ మండలం అంకాపూర్ లో ” మేరా బూత్ సబ్సే మజ్బుత్” కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించారు ధర్మపురి అరవింద్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో మెజారిటీ స్థానాలు తామే గెలుస్తామని.. మా స్ట్రాటజీ మాకు ఉందని తెలిపారు.

సీఎం కేసీఆర్ పనిగట్టుకొని కాంగ్రెస్ ని హైప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక బిఆర్ఎస్ కి దూరంగా ఉంటున్నామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేశారు. కారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉందని అన్నారు. అమిత్ షా తో కేటీఆర్ సమావేశమయ్యారని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కాంగ్రెస్ – బిఆర్ఎస్ రెండూ ఒక్కటేనని మరోసారి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news