తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

-

కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్స్ చేయవద్వదని మంత్రి హరీశ్ రావు తనకు సూచించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు కొట్టి పారేశారు. తనకు ఫోన్ చేసి మంత్రి క్లాస్ తీసుకున్నారనేది పూర్తిగా అవాస్తవం అని చెప్పారు. డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను ఆదివారం కొత్తగూడెంలో ఉన్నానని తెలిపారు.

అక్కడి ప్రజల కష్టాల తెలుసుకునేందుకు గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొందరూ గిట్టని వ్యక్తులు తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని తెలిపారు. ప్రజలు, మీడియా మిత్రులు ఆ ప్రచారాలను అస్సలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా కొత్తగూడెంలో జీఎస్ఆర్ ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ గారి స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news