రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రైతు సదస్సు…బీజేపీ ప్రకటన

-

బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ కృష్ణ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు పై రేపు తేదీ 14 అక్టోబర్ 2023న ఉదయం 11 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రైతు సదస్సును భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని ఈ ప్రకటనలో తెలిపారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.

ఈ సదస్సులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్, పార్లమెంటు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, శాసన సభ్యులు శ్రీ ఈటల రాజేందర్, బిజెపి తమిళనాడు రాష్ట్ర సహా ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఎ పి జితేందర్ రెడ్డి, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీమతి విజయశాంతి, బిజెపి సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల నుండి రైతు సంఘాల నాయకులు, సాగు నీటి పారుదల రంగంలోని నిపుణులు, ఇంజనీర్లు ,మేధావులు, రైతులు పాల్గొంటున్నారని ప్రకటనలో వివరించారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news