రైతులు కెసిఆర్ కు చిప్పకూడు తినిపించాలి: మాజీ ఎంపీ విజయశాంతి..

-

నిజామాబాద్ జిల్లా బోధన్ లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ విజయ శాంతి.రైతు సదస్సు ద్వారా రైతులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో 8 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందో రైతులు ఆలోచించాలని,తెలంగాణలో హుజురాబాద్ ఓటమీ, 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయంతోనే కేసీఆర్ కు భయం పట్టుకుంది.భయం నుండి బయట పడేందుకే రైతులను అడ్డపెట్టుకొని వడ్ల కొనుగోలు విషయం తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నాడని కేసీఆర్ పై మండిపడ్డారు విజయశాంతి.కాంగ్రెస్, trs, దళారులు ముగ్గురూ కలిసి రైతులకు మేలు చేసే రైతు చట్టాలను అడ్డుకున్నారు.

కేంద్రానికి బాయిల్డ్  రైస్ ఇవ్వను అని లెటర్ ఇచ్చిన మాట నిజం కాదా కేసీఆర్ చెప్పాలని అన్నారు.బీజేపీ ని చూసి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది,రైతుల రుణమాఫీ ఎందుకు చేయలేదో కేసీఆర్ చెప్పాలి.8 ఏళ్లుగా మాటల గారాడితో పబ్బం గడుపుతున్న కేసీఆర్ కు రైతులు చిప్పకూడు తినిపించాలని పిలుపునిచ్చారు.రైతులు ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది, రైతులు మేలుకొనాలి, గళం విప్పాలి, కేసీఆర్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని,ఎప్పటికైనా రైతులకు అండగా ఉండే పార్టీబీజేపీ పార్టీ, నరేంద్రమోదీ గారే నని అన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news