మాజీ మంత్రి తలసాని OSD ఆఫీస్ లో ఫైల్స్ మాయం..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అధికార మార్పిడి జరుగుతోంది. N మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు తమ ఆఫీసులో ఛాంబర్లు కాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులోని మాసబ్ ట్యాంకులు ఉన్న తెలంగాణ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కావడం ఇప్పుడూ సంచలనంగా మారింది. పశువర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ ఆఫీసులో కీలకమైన డాక్యుమెంట్లు మిస్ అయినట్టు సమాచారం.

ఆఫీస్ కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగులు ఫైల్స్ ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఫైల్స్ మాయమైనట్టు గుర్తించిన అధికారులు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఫైల్స్ మిస్సింగ్ ఘటనపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ను ప్రశ్నించగా.. ఫైల్స్ అదృశ్యంపై తమకు ఎలాంటి సమాచారం లేదని డైరెక్టర్ చెప్పినట్టు డీసీపీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news