బిజెపికి భారీ షాక్…మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం రాజీనామా

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపికి భారీ షాక్ ఎదురైంది. బిజెపి సీనియర్ నాయకులు,సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

former MLA Mrityunjayam resigns
former MLA Mrityunjayam resigns

గతంలో కేంద్ర,రాష్ట్ర ఎన్నికల్లో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ… కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీల సంబంధాలు మొదలుకొని…. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల తాను బిజెపి పార్టీలో కొనసాగలేనని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ తనకు అప్పగించిన ఎస్టి కమిటీ బోథ్ నియోజకవర్గ కమిటీ ఇంచార్జీ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news