BREAKING : హైదరాబాద్ లోని ఆ వినాయకుడి లడ్డూకు రికార్డు ధర..రూ.1.26 కోట్లు

-

హైదరాబాద్ సన్ సిటీ లోని రిచ్మండ్ విల్లాలో గణేష్ లడ్డూకు రికార్డు ధర పలికింది. వేలం పాటలో వినాయకుడి లడ్డూను రూ. 1.20 కోట్లకు దక్కించుకున్నారు. 2022 వేలంలో ఇక్కడ వేలంపాటలో లడ్డు రూ.60.80 లక్షలు పలికింది. మరోవైపు మాదాపూర్ మై హోమ్ భూజాలో చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి రూ. 25.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది మై హోమ్ భుజాలో లడ్డు 18.50 లక్షలు పలికింది.

కాగా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆందోళనతో అధికార యంత్రాంగం దిగి వచ్చింది. హుస్సేన్ సాగర్ సహా చెరువులు పిఓపితో వేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఆదేశించడంతో అధికారులు నిన్న సాయంత్రం వరకు ఏర్పాట్లు చేయలేదు. ప్రభుత్వం స్పందించకపోతే తాము నిమజ్జనం చేసి తీరుతామని ఉత్సవ సమితి సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో హుస్సేన్ సాగర్ తీరంలో 13 క్రేన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. దీంతో హైకోర్టు వద్దన్నా కూడా హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news