భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం, 58 అడుగులకు చేరిన నీటిమట్టం

-

గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం ప్రవహిస్తుంది. ఎగువ నుంచి అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద వస్తుంది. ఈ వరదతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తుంది.

ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58. 10 అడుగుల వద్ద ఉన్నది. పై నుంచి శ్రీ రామ్ సాగర్, కాలేశ్వరం, మేడిగడ్డ, తుపాకుల గూడెంతో పాటు చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాలలో కూడా ప్రమాదకర స్థాయిలో దాటి వర్షాలు వస్తున్నాయి. దీంతో భద్రాచలంకు 20 లక్షల క్యూసెక్కుల పైగా వరద నీరు వస్తుందని అధికారులు చెప్తున్నారు.

ఇంత పెద్ద స్థాయిలో వర్షం వస్తుందటతో భద్రాచలం వద్ద వరద తీవ్రత పెరుగుతుంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 508.3 అడుగులకి చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. 2020లో 61.6 అడుగులు సెప్టెంబర్ నెలలో వరద వచ్చింది.. ఇప్పుడు మళ్లీ దానిని మించి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news