మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన పసిడి ధరలు

-

ఇండియాలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది.

దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.

తాజాగా మరో సారి బంగారం ధరలు పెరిగిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 47, 510కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 51, 820 కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. కిలో వెండి ధర రూ. 500 కి తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.66, 000 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news