వేములవాడ రాజన్న భక్తులకు శుభవార్త…ఇవాళ్టి నుంచి నిరంతరం దర్శనాలు

-

వేములవాడ రాజన్న భక్తులకు శుభవార్త చెప్పింది ఆలయ కమిటీ. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతోంది. సమ్మక్క భక్తుల రద్దీ దృష్ట్యా రాజన్న అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుండి వచ్చే నాలుగు ఆదివారాలు రాత్రి (కంటిన్యూ గా) భక్తులకు నిరంతరం దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు వేములవాడ రాజన్న అధికారులు.

Good news for devotees of King Vemulawada

ఫిబ్రవరి నెలలో జరిగే సమ్మక్క జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ నెల 21, అలాగే 28 తేదీ , ఫిబ్రవరి 4వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ ఆదివారాల్లో రాత్రి నుంచి తెల్లవార్లు వేములవాడ రాజన్న ఆలయం…తెరిచి ఉండనుంది. కోడె మొక్కుబడి, దర్శనాలు కొనసాగనున్నాయి. ఈ విషయాలను భక్తులు గమనించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news