గిరిజనులకు, దళితులకు గుడ్ న్యూస్.. అదనంగా రూ.లక్ష సాయం

-

గిరిజనులకు, దళితులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క. ముఖ్యంగా వారి కోసం  అదనంగా రూ.లక్ష సాయం చేయనున్నట్టు తెలిపారు. తాజాగా భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.

సాధారణంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేస్తామని.. ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం కింద గిరిజనులు, దళితులకు రూ.1లక్ష అదనంగా ఇస్తామని వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూ.1లక్ష అదనంగా కలిపి మొత్తం రూ.6లక్షలను ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news