పోడు రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త..ఈ నెలలోనే పట్టాలు

-

పోడు రైతులకు కేసీఆర్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రైతులకు ఈ నెలలోనే పట్టాలు మంజూరు చేయనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్న ఆమె, ప్రస్తుతం జిల్లా కమిటీల ఆమోదానికి వెళ్లినట్లు చెప్పారు. ఆమోదం లభించిన తర్వాత పోడు రైతులకు భూ యాజమాన్య హక్కులు దక్కుతాయని సత్యవతి రాథోడ్ తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మూడు గిరిజన గురుకులాలను ప్రారంభించనున్నట్లు సత్యవతి రాథోడ్ వెల్లడించారు. గిరిజనులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని.. తమ ప్రభుత్వం.. వారికోసం పని చేస్తుందని వెల్లడించారు సత్యవతి రాథోడ్.

Read more RELATED
Recommended to you

Latest news