సంపర్క్‌ క్రాంతి రైలు పేరు మార్పు..ఇక నుంచి అక్షరధామ్ ఎక్స్​ప్రెస్​గా​..!

-

అహ్మదాబాద్‌ – దిల్లీ మధ్య నడిచే సంపర్క్‌ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. రైలు పేరును అక్షరధామ్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. స్వామినారాయణ్ సంస్థ ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామి మహరాజ్‌కు నివాళులర్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ రైలు దిల్లీ, అహ్మదాబాద్‌లోని అక్షరధామ్ దేవాలయాలను కలుపుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్వామినారాయణ సంస్థ చేస్తున్న సేవలకు ఈ రైలు పేరు మార్పు చిరుకానుక అని చెప్పారు. అహ్మదాబాద్‌ – దిల్లీ మధ్య 2005లో మార్చిలో తొలి సర్వీసు ప్రారంభమైంది. ఈ రైలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల మీదుగా దిల్లీకి చేరుతుంది. 1074 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటలపాటు ప్రయాణిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news