యాదాద్రి దేవాలయం అద్భుతంగా కట్టారు..కేసీఆర్‌పై గవర్నర్ ప్రశంసలు !

-

యాదాద్రి దేవాలయం అద్భుతంగా కట్టారని..పరోక్షంగా కేసీఆర్‌పై గవర్నర్ రాధాకృష్ణన్‌ ప్రశంసలు కురిపించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ సిపి రాధాకృష్ణన్..ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు స్వస్తి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు.

CP Radhakrishnan

స్వామివారిని దర్శించుకుని.. స్వర్ణపుష్పార్చనలో పాల్గొన్న గవర్నర్….ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది….ఆలయాన్ని అద్భుతంగా పూర్ణ నిర్మాణం చేశారన్నారు. వేల సంవత్సరాలు ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. చాలాకాలంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకున్న… గవర్నర్ హోదాలో దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది….తెలంగాణ ప్రజలు ఆనందంగా సుభిక్షంగా ఉండాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news