గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్లు ఉంది : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

-

గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్టుందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేర్కోన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోకు చట్టబద్ధత ఉండాలని.. కాంగ్రెస్ మొత్తం 412 హామీలు ఇచ్చిందని గుర్తుకు చేశారు. ఈ సెషన్ లోనే కాంగ్రెస్ హామీలకు చట్టబద్ధత తీసుకు రావాలి. ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ పోరాటం చేస్తుంది. ప్రతి రోజు దర్బార్ నడిపిస్తామని చెప్పి ఇప్పుడు వారానికి రెండు రోజులు అంటున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మారుస్తామని అన్నారు. ఇప్పుడు డిప్యూటీ  సీఎం అధికారిక నివాసంగా మార్చారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో వుంచుకుని హామీలను విస్మరిస్తే పోరాటం చేస్తాం.  అనేక హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజారిటీ ఇచ్చారరేవంత్ రెడ్డి స్వయంగా రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక స్తానంలో ఓడిపోయారుసీఎంకు పాలనా అనుభవం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ల సలహాలతో ముందుకు వెళ్ళాలి. రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news