కొమురవెల్లి మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్ రావు

-

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో అంగరంగ వైభవంగా మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం సాగుతోంది. బృహన్మఠాధీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. బలిజమేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జునుడు మనువాడాడు. కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి బంగారు కిరీటాన్ని కానుకగా అందించారు.

మల్లికార్జునస్వామి కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు స్వామి వివాహాన్ని కన్నులపండువగా జరుపుతున్నారు. స్వామి వారి కల్యాణ వేడుకను మంత్రి హరీశ్ రావుతో పాటు మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర ప్రజాప్రతినిధులు భక్తి పారవశ్యంతో తిలకించారు.

Read more RELATED
Recommended to you

Latest news