ఏపీలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే..తెలంగాణ 54 లక్షలు ఎకరాలు – హరీష్‌ రావు

-

ఏపీలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే..తెలంగాణ 54 లక్షలు ఎకరాల వరి సాగు అవుతుందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన జగదేవ్ పూర్ బస్టాండులో సీఎం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల రమేశ్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర స్థాయి గ్రేస్ బాల్-క్రికెట్ టోర్నమెంట్ విజేత ఉప్పల్ టీమ్, రన్నరప్ జగదేవ్ పూర్ టీమ్ కు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టోర్నమెంట్ నిర్వహించిన సర్పంచ్ రమేశ్ ను అభినందించారు.


కేసీఆర్ కారణజన్ముడని, చరిత్రను తిరగ రాశారని, కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లకు నీళ్లు వచ్చేవి కావని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతున్నది. ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి సాగు చేశామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు జొన్న, గట్క మక్క గట్క తప్ప ఏమీ తినలేదని, ఇవాళ తన వల్ల అన్నం తింటున్నారని టీడీపీ చంద్రబాబు చెప్పడం విడ్డురంగా ఉన్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ విమర్శించారు.

తైవాన్ దేశం నుంచి హాక్సన్ కంపనీ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ గారిని కలిస్తే తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి పై ప్రజంటేషన్ ఇచ్చారని, ఏడేండ్లలో అబ్బురపోయేలా అభివృద్ధి కేసీఆర్ విజన్ చూసి తైవాన్ వచ్చి తమ ప్రభుత్వానికి వివరించాలని తైవాన్ దేశ ప్రతినిధులు కోరినట్లు, ఇది చూసిన తమకు ఎంతో సంతోషం కలిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ ఈ గడ్డపై ఇవాళ మండుటెండలో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయని సంబురం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news