చార్మినార్‌ వద్ద హైటెన్షన్‌..భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పోలీసుల భారీ భద్రత

-

హైదరాబాద్ : పాతబస్తీ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. యూపీ సీఎం యోగి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల యోగి భాగ్య లక్ష్మి అమ్మవారి దర్శనం రేపటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందస్తు చర్యల్లో భాగంగా చార్మినార్ వద్ద పోలీస్ లు మోహరించారు.

మరో వైపు చార్మినార్ వద్ద వివాదంగా మారిన టీఆర్ఎస్ నేతల బైక్ ర్యాలీ అడ్డుకున్నారు పోలీసులు. ఈ నేపద్యంలో శాంతిభద్రతలకు విగతం కలగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే.. కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ డిసిపి చైతన్య ఆధ్వర్యంలో పోలీస్ భద్రత పర్యవేక్షణ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news