హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. చెరువును తలపించిన విజయవాడ హైవే

-

భాగ్యనగరాన్ని వర్షం మరోసారి ముంచెత్తించింది. శనివారం కురిసిన వానకు నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లితో పాటు మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, హయత్​నగర్​, పెద్ద అంబర్​పేట​, ఎల్బీనగర్,​ నాగోల్, వనస్థలిపురం, మన్సూరాబాద్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్‌ ప్రాంతాల్లోపాటు చిలకలగూడ, అల్వాల్,  ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, అడిక్​మెట్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి, కవాడి గూడ, దోమల గూడ, భోలక్ పూర్, మలక్​పేట, జవహర్‌నగర్​లో కురిసిన జోరు వాన రహదారులను ముంచెత్తింది.

వనస్థలిపురంలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. చింతల్‌కుంట వద్ద వర్షపు నీరు చేరి చెరువును తలపించింది. పనామా- ఎల్బీనగర్‌ మధ్య వాహనాలు స్తంభించిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఎగువ నుంచి కురిసిన వర్షపు నీరు జాతీయ రహదారిపైకి చేరడం, దానికితోడు విస్తరణ పనుల మధ్య రోడ్డంతా వరదనీటితో నిండిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి చెరువును తలపించింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల కొద్ది వాహనదారులు రహదారిపైనే ఎదురుచూడాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news