నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

-

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే మరో మూడు రోజులు పాటు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

 

తాజా అలర్ట్ ప్రకారం మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్ కుమురంబీం, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అలాగే కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం చోర పల్లి లో పిడుగు పడి అంజన్న యువకుడు మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news