అందుకే చంద్రబాబుతో దూరం పెరిగింది: కేటీఆర్

-

చంద్రబాబుతో తామెప్పుడూ వివాదాలు పెట్టుకోలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దావోస్ లో 12 రోజుల పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఆయన ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని, రూ. 4,200 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. మొత్తంగా 25 సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉండరు అన్న కేటీఆర్.. ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తనకు పెద్దన్న లాంటి వారని అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు తోనూ తామెప్పుడూ వివాదాలు పెట్టుకో లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపడం వల్లే ఆయన తో దూరం పెరిగిందని అన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది తామేనని కేటీఆర్ తేల్చిచెప్పారు. కేటీఆర్ భవిష్యత్ ప్రధాని అన్న వెంచర్ క్యాపిటలిస్టు వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. సీఎం దయతో తాను మంత్రిగా ఉన్నానని, తనకు ఇంతకు మించి ఆశలు లేవని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news