Hyd: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తమామలను చంపేందుకు కోడలు కుట్ర !

-

Hyd: హైదరాబాద్‌ బేగంబజార్ లో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్త మామలను చంపేందుకు ప్రయత్నం చేసింది ఓ కోడలు.అత్త మామలు చనిపోతే కోట్ల రూపాయల డబ్బు వస్తుందని కోడలు ఆలోచనకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అత్త మామలపై బంధువులతో దాడి ఛేయించిందట కోడలు.అత్త, మామను చంపేస్తే ఇన్సూరెన్స్ సొమ్ము లు వస్తాయని ప్లాన్ వేసిందట.

ఇందులో భాగంగానే ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా వారిని దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. డయల్ 100కు  ఫోన్ చేసిన స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. అందరు చూస్తుండగానే.. కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు దుండగులు. అయితే.. ఈ సంఘటనలో బాధితులు కొడుకు కూడా గాయపడినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది ఈ దాడి ఘటన. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అత్త, మామలు. న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు బాధితులు.

Read more RELATED
Recommended to you

Latest news