ఖమ్మంలోని వరద బాధితులకు 7 వేల ఇందిరమ్మ ఇండ్లు!

-

ఖమ్మం వరద బాధితులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖమ్మం వరదలకు ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. భారీ వర్షాలు అలాగే వరదలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ఇండ్లు కూలినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కలెక్టర్లు నివేదిక పంపించారు.

Indiramma houses for those who lost their homes due to Khammam floods

అయితే ఇండ్లు కూలిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే స్థలం లేని వారికి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని… ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి దీన్ని ఏమరకు అమలు చేస్తుందో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news