10 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయానికి బండి సంజయ్..!

-

బేగంపేట ఎయిర్ పోర్టు నుండి విజయవాడకు బయలుదేరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. విజయవాడలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే చేయనున్నారు బండి సంజయ్. శివరాజ్ సింగ్, బండి సంజయ్ తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాశ్ నగర్ ఏరియల్ సర్వే చేసి.. కూసుమంచి మండలం జుజ్జులురావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను సందర్శించనున్నారు.

అక్కడి నుండి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట వచ్చి.. నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. అయితే 10 ఏళ్ల తరువాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయానికి రాబోతున్నారు బండి సంజయ్ కుమార్. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్ లో పాల్గొననున్న బండి సంజయ్.. సచివాలయంలో మీటింగ్ అనంతరం శివరాజ్ సింగ్ తో కలిసి బేగంపేటకు వెళ్తారు. అక్కడ శివరాజ్ సింగ్ కు వీడ్కోలు అనంతరం నేరుగా కరీంనగర్ బయలుదేరనున్న బండి సంజయ్.. శివరాజ్ సింగ్ తో కలిసి హైదరాబాద్ వెళ్లాల్సిన నేపథ్యంలో కోదాడ పర్యటనను రద్దు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news