మెదక్ పార్లమెంట్ లో 1999 తరువాత బీజేపీ గెలవక పోవడం బాధాకరం : రఘునందన్ రావు

-

భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ మనోహరబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ పాల్వాయి హరీశ్ బాబు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. అయితే రఘునందన్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మెదక్ పార్లమెంట్ లో 1999 తరువాత బీజేపీ గెలవక పోవడం బాధాకరం అన్నారు. కేవలం 5 నిమిషాల్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానిది. ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరిలా తయాయ్యింది అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా.. గల్లి నుంచి ఢిల్లీ దాకా మళ్ళీ బీజేపీ ని కోరుకుంటున్నారు అని తెలిపారు. మెదక్ కి రైలు తీసుకొచ్చిన  ఘనత మోడీ ప్రభుత్వానిదే అన్నారు. అయోధ్యకు వెళ్లిన వారు రామమందిరం కట్టించిన పార్టీ గెలవాలని కొరుకోవలడం లేదా..? అన్నారు. బీజేపీ హయాంలో దేశం అభివృద్ధి చెందిందని తెలిపారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news