రాముడి ప్రాణ ప్రతిష్ట మోడీ చేయడాన్ని పీఠాధిపతులే వ్యతిరేకిస్తున్నారు : మంత్రి పొన్నం

-

శ్రీరాముడు అందరివాడని, కొందరి వాడు అన్నట్లుగా బీజేపీ ప్రచారం చేయడం సరికాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాముడి గుడి పేరుతో బీజేపీ రాజకీయం చేయడం ఆపాలని మంత్రి సూచించారు. పవిత్ర కార్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేయడమేంటని ప్రశ్నించారు.

రామాలయం ప్రాణప్రతిష్ఠ ప్రధాని మోదీ చేయడాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాములవారి అక్షతల పేరుతో బియ్యం సంచులు ఇస్తున్నారని ఆక్షేపించారు. మళ్లీ గెలుస్తామో..తిరుగుబాటు వస్తుందో కాలమే నిర్ణయిస్తుందన్నారు. మహిళకు ఉచిత బస్సు సౌకర్యం వద్దంటూ కొందరు పిల్‌ వేయడం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news