తనపై ట్రోలింగ్ చేసే వారిని బట్టలూడదీసి కొడతా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తనపై ట్రోలింగ్ చేసే వారిని.. తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే వారిని బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. తాజాగా ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం గ్యాంగ్ లా మారిందని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ మతి భ్రమించినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

 

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులపై కొందరూ సోషల్ మీడియా ముసుగులో కాంగ్రెస్ వ్యతిరేకులు కొందరూ తప్పుడు పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ ఆశ్యర్యకర విషయం ఏమిటంటే.. తాను లేడి కలెక్టర్ ను బూతులు తిట్టినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపించారు జగ్గారెడ్డి. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లను ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టనని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం దూరం కావడంతో కాంగ్రెస్ ఇష్టానుసారంగా మాట్లాడి ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news