BREAKING: బీజేపీ గూటికి మేడ్చల్ మాజీ జడ్పీటీసీ జేకే శైలజ హరినాథ్

-

 

గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవలు చేసి గత ప్రభుత్వం ఆదేశించిన పనులను పూర్తిచేసి బీఆర్ఎస్ పార్టీకి కృషి చేశారు. అయినా ఆమెకు ఆ పార్టీలో సముచిత స్థానం కల్పించి ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడంతో టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రం రెడ్డి, నందా రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లిఖార్జున్ ముదిరాజ్ సమక్షంలో సోమవారం రాత్రి బిజెపి కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఇక నుంచి పార్టీ అభివృద్ధి కోసం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మేడ్చల్ మండల మాజీ జడ్పీటీసీ జేకే శైలజహరినాథ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news