BRSను వదిలి పెట్టి కాంగ్రెస్ లో చేరటం సంతోషంగా ఉంది – జూపల్లి

-

BRSను వదిలి పెట్టి కాంగ్రెస్ లో చేరటం సంతోషంగా ఉందన్నారు జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ నేతలు చేరారు. కాసేపటి క్రితమే కాంగ్రెస్ లోకి చేరారు జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ నేతలు. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ చేరికలు జరిగాయి. ఈ తరుణంలోనే…జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..కాంగ్రెస్ లో ఘర్ వాపస్ అన్నారు.

కేసీఆర్ పాలన చూస్తుంటే బాధగా ఉందని.. కేసీఆర్ ది దుర్మార్గ మయిన మనస్తత్వం అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రజల్ని మభ్య పెడుతున్నారని… దేశ చరిత్రలో ఇంత అవినీతి మయమయిన ముఖ్యమంత్రి ఎవరు లేరని సీఎం కేసీఆర్‌ పై ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట గలిసిందని.. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెడుతున్నారన్నారు జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి, కాంగ్రెస్ రుణాన్ని తీర్చుకోవాలి…వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news