పది లక్షల మందితో ప్రపంచ శాంతి సభలు : కేఏ పాల్

-

చాలా సంవత్సరాల తర్వాత ప్రపంచ శాంతి సభలను తిరిగి నిర్వహిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. అక్టోబర్ 2న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో 10లక్షల మందితో శాంతి సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ​లో ప్రపంచ శాంతి సభల పోస్టర్ ​ను కేఏ పాల్​ ఆవిష్కరించారు. ఈ సభలకు ప్రపంచ దేశాల్లోని ప్రధానులు, మంత్రులు హాజరవుతారని.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో ఈ సభలను నిర్వహిస్తున్నామని కేఏ పాల్ తెలిపారు. గాంధీ జయంతి రోజును నిర్వహించే ఈ సభ ద్వారా రాజకీయ నాయకుల్లో ఆ స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేఏ పాల్​ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news