వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 30 సీట్లు కూడా రావు : కేఏ పాల్‌

-

వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి 30 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పై కేపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రశాంత్ కిషోర్ తనకు చెప్పినట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సేవలందించలేక చల్లగా పీకే జారుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. 2008లో కెసిఆర్ తనను కలిశారని తెలిపారు. తన మద్దతు కోరగా తాను దేశ జాలు లేకుండా అందించామని వివరించారు కే ఏ పాల్.

అయితే టిఆర్ఎస్ తెలంగాణ లో అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. టిఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. రాష్ట్రం నెత్తి మీద నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని ఫైర్ అయ్యారు. తెలంగాణకు దళితుడే తొలి సీఎం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు

Read more RELATED
Recommended to you

Latest news