ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్యలకు కడియం శ్రీహరి సవాల్..!

-

జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి  ఒక దొంగ,  స్టేషన్ ఘనపూర్  మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో దొంగ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లా, రాజయ్యలకు సవాల్ విసిరారు. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడినా తాను రాజీనామా చేస్తానని.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వద్ద డబ్బులు అధికంగా ఉండొచ్చు.. నా దగ్గర డబ్బులు లేవు. రాజేశ్వర్ రెడ్డి ఎక్కడెక్కడ నొక్కాడో నాకు అంతా తెలుసు అన్నారు కడియం శ్రీహరి. 

మరోవైపు మంగళవారం రాజయ్య మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరికి ఆయన కూతురు కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హవాలా రూపంలో విదేశాలకు డబ్బులు తరలించారని ఆరోపించారు. తన మాట వినని వారిని కడియం నిర్దాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేయించాలని కీలక ఆరోపణలు చేశారు. డీఈవోల బదిలీల్లో రూ.2 కోట్లు తీసుకున్నారని వెల్లడించారు. తన కూతురికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ లో ఉంటానని.. లేకపోతే కాంగ్రెస్లో చేరుతానని బ్లాక్ మెయిల్ చేశాడని అన్నారు. చివరికి తన కూతురికే టికెట్ ఇప్పించుకొని పార్టీని నిండా ముంచి స్వార్థప్రయోజనాల కోసం పార్టీ మారాడని సీరియస్ అయ్యారు. అంతేకాదు.. అసలు కడియం శ్రీహరి కులవారసత్వంపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news