కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం.. హైకోర్టులో విచారణ వాయిదా

-

కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమి పై HCU, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే కంచ గచ్చిబౌళి భూములను టీజీఐఐసీకి కేటాయింపు, టీజీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అదేవిధంగా ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరారు.

వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు మరో ముగ్గురు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్ల పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పలు పిటిషన్ల పై విచారణ ను వేసవి సెలవుల తరువాత వాయిదా వేస్తున్నట్టు గా న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news